Jump to content
🌐 Login to translate and view site in ANY language
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

నిన్న జలభాండం.. నేడు ఎడారి! Madhyamaneru (water, desert)


TELUGU

Recommended Posts

కేసీఆర్‌ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది.

ss-5-1024x576.jpg

నిరుడు కళకళ… ఇప్పుడు వెలవెల

అడుగంటిన మధ్యమానేరు జలాశయం

2019-2023 వరకు వాటర్‌హబ్‌

కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు

కాంగ్రెస్‌ పాలనలో పరిస్థితి రివర్స్‌

మధ్యమానేరు కాలువ గేట్లు తెరిచినా

అన్నపూర్ణకు చుక్కనీరు పారని దుస్థితి

ఇదే కొనసాగితే రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరం

కరీంనగర్‌, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్‌ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది.

ఈ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ వరకు జలాలను ఎత్తిపోసిన ఘనతను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లిఖించుకుంటే, పక్కనే ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టుకు కూడా నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అనే చెడ్డ పేరును కాంగ్రెస్‌ తెచ్చుకుంటున్నది. నాడు ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రకారం చివరి భూమి వరకు ప్రాజెక్టులో నీరు ఉండగా.. నేడు అవే భూములు ఎడారిని తలపిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టును వాటర్‌హబ్‌గా మార్చింది. కాళేశ్వరం నుంచి గాయత్రి పంపుహౌస్‌ ద్వారా మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోసింది.

అక్కడినుంచి ఇటు దిగువమానేరు జలాశయం, అటు అన్నపూర్ణ రిజర్వాయర్‌ మీదుగా కొండపోచమ్మసాగర్‌, ఎగువమానేరు వరకు నీటిని ఎత్తిపోసింది. మధ్యమానేరుకు కాళేశ్వరం ఎత్తిపోతలు 2019లో ప్రారంభం కాగా, అప్పటినుంచి 2023 డిసెంబర్‌ వరకు ఈ ప్రాజెక్టు 365 రోజులూ నిండుకుండలా ఉండేది. మధ్యమానేరు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 27.50 టీఎంసీలు కాగా, నిరుడు మార్చిలో 23 టీఎంసీల నీటి నిల్వలున్నాయి.

నీటి నిల్వలు ఎంత తగ్గితే అంత నీటిని కాళేశ్వరం నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎత్తిపోసింది. గత మార్చిలో ఒకవైపు కొండపోచమ్మసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తూనే, ఎల్‌ఎండీ (దిగువ మానేరు జలాశయం) పరిధిలోని పంటలకు ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని నిరంతరాయంగా విడుదల చేసింది. కానీ, ప్రస్తుతం మూడు నెలల కాంగ్రెస్‌ పాలనలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు ప్రారంభమైన తర్వాత ఏనాడూ లేని దుస్థితి నేడు మధ్యమానేరు ప్రాజెక్టులో కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ తొమ్మిది టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది.

waterr_V_jpg--816x480-4g.webp?sw=1728&ds

గేట్లు తెరిచినా చుక్కనీరు వెళ్లడం లేదు
మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్‌, అక్కడినుంచి రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని కేసీఆర్‌ ప్రభుత్వం ఎత్తిపోసింది. మధ్యమానేరు నుంచి మొదటిసారిగా 2020 మే 11న అన్నపూర్ణకు నీటిని ఎత్తిపోశారు. అప్పటినుంచి అవసరాలకు అనుగుణంగా ఎత్తిపోతలు కొనసాగుతూ వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి వద్ద నిర్మించిన ఈ రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు.

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు మధ్యమానేరు జలాశయానికి మధ్య దూరం 11.186 కిలోమీటర్లు. మధ్యమానేరు నుంచి అన్నపూర్ణకు నీటిని పంపించడానికి ఓగులాపూర్‌ గ్రామపరిధిలో కాలువలు, దానిపై క్రస్ట్‌గేట్లు ఏర్పాటుచేశారు. ఇవి ఓపెన్‌ చేస్తే అన్నపూర్ణ రిజర్వాయర్‌ పరిధిలో ఏర్పాటుచేసిన సర్జ్‌పూల్‌కు గ్రావిటీ, సొరంగమార్గం ద్వారా నీరు వెళ్లేది. ఆ మేరకు ఎప్పటికప్పుడు సర్జ్‌పూల్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేవారు.

ఇప్పుడు మొత్తం క్రస్ట్‌గేట్లు ఎత్తినా చుక్కనీరు కూడా అన్నపూర్ణకు వెళ్లడంలేదు. అలా వెళ్లాలంటే మధ్యమానేరులో పది టీఎంసీలపైన నీటి నిల్వలు ఉండాలి. ప్రస్తుతం తొమ్మిది టీఎంసీలే ఉండటంతో పైకి నీరు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. దీంతో అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొంచపోచమ్మసాగర్‌, ఎగువమానేరు ప్రాజెక్టులు, వాటి కాలువలను నమ్ముకొని పంటలు వేసిన రైతులు సాగునీరు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇదే కొనసాగితే ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాడు నీటి నిల్వలు, నేడు వరిపొలాలు
ప్రస్తుతం మధ్యమానేరు వెనుక భాగమంతా ఎడారిని తలపిస్తున్నది. కేసీఆర్‌ హయాంలో నిండుకుండలా ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటింది. ఇటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి గానీ, అటు కాళేశ్వరం నుంచి గానీ నీళ్లను మధ్యమానేరుకు ఇచ్చే సమర్థత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని భావించిన రైతులు ప్రాజెక్టు చివరి భూముల్లో వరితోపాటు వివిధ రకాల పంటల సాగు చేస్తున్నారు. చీర్లవంచ, అగ్రహారం, చింతల్‌ఠాణా, రుద్రారంతోపాటు మరికొన్ని గ్రామాల రైతులు, మధ్యమానేరు భూముల్లో సాగు చేసుకుంటున్నారు.

ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్లు నింపదు కాబట్టి.. తమ పంటలు ప్రాజెక్టులో మునిగిపోయే ప్రసక్తే లేదన్న ధీమా వారిలో కనిపిస్తున్నది. ఇదిలాఉండగా, ప్రాజెక్టు చివరి భూముల్లోని బావుల్లోనూ నీళ్లు అడుగంటిపోతున్నాయి. మహా అయితే ఈ పంటకు నీళ్లు సరిపోతాయని రైతులు భావిస్తున్నారు. కేసీఆర్‌ హయాంలో వాటర్‌హబ్‌గా, జంక్షన్‌గా ఉన్న మధ్యమానేరులో జలాలు అడుగంటిపోవడం వల్ల దానికి అనుసంధానంగా ఉన్న ఎన్నో ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కాళేశ్వరం ఎత్తిపోతలు చేపడితే, లక్షలాది కుటుంబాలకు జలాలు అందుతాయని ఈ ప్రాంత రైతులు భావిస్తున్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

CBN ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం!!

Congress ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం!!

History doesn't LIE

Link to comment
Share on other sites

THOUSANDS OF INNOCENT PEOPLE DIED DURING TDP's RULE

వైజాగ్ లో డ్రగ్స్ తో దొరికిన టిడిపినేత

(ఈ కంటైనర్ కోసమే లావు గాడు పార్టీ మారాడా?)

40 దేవాలయాలు కూలగొట్టాడు జై మోడీ

అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు చేపించాడు జై మోడీ

చివరికి గీతాంజలి

సృష్టించేది బ్రహ్మ

శాసించేది కమ్మ

అడ్డొస్తే లేపేస్తావమ్మా

జూనియర్ ఎన్టీఆర్

నందమూరి రామకృష్ణ

వంగవీటి మోహన రంగ

పింగళి దశరథ రామయ్య

సీనియర్ ఎన్టీఆర్

గోదావరి పుష్కరాల్లో 29 మంది

చిత్తూరు జిల్లాలో 25 మంది కూలీలను కాల్చి చంపటం

ఏర్పేట్లో ఇసుక లారీ తో 9 మందిని చంపటం

కందుకూరులో 9 మంది

గుంటూరులో 3

పిన్నిని చున్నీతో ఉరేయటం

హరికృష్ణ శవం దగ్గర రాజకీయం

రాజకీయానికి తీసుకొచ్చి తారకరత్న

కారంచేడు సంఘటన,

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్

ANU యూనివర్సిటీలో రిషితేశ్వరి

చంద్రబాబు నాయుడు హయాంలో మిస్సయిన 35,000 మంది మహిళలు

యాక్టర్ ప్రత్యూష హత్య

ఎలిమినేటి మాధవరెడ్డి హత్య

ఎర్ర నాయుడు యాక్సిడెంట్,

లాల్ జాన్ బాషా యాక్సిడెంట్

అమిత్ షా కారు మీద రాళ్లదాడి,

మోడీని ఉగ్రవాది,

చెరుకులపాడు సూర్యనారాయణ రెడ్డి హత్య,ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య

బషీర్బాగ్ కాల్పులు

రమేష్ హాస్పటల్ లో 23 మందిని చంపటం

ఎమ్మార్వో వనజాక్షి

కాపుల మీద కేసులు,

రాయలసీమ వాళ్లని రౌడీలని,

మీకెందుకురా హైకోర్టు అని,

పేదవాడికి ఇంగ్లీష్ మీడియం వద్దని,

పేదవాడికి ఇల్లు ఇవ్వద్దని 1180 కేసులు

విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్

రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం

2019 వరకు పేదరికం 11.3% ఇప్పుడేమో 4.7%

పెన్షన్ కోసం రేషన్ కోసం అవ్వ తాతని తిప్పి తిప్పి చంపటం

జన్మభూమి కమిటీల దోపిడీ

క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని జగన్ ని అని, ఈ ముసలోడు చర్చికి వెళ్లి బైబిల్ చదవడం

పేదలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ చెడగొట్టడం

పేద పిల్లలకి టాప్స్ ఇస్తే అవమానించడం

గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి పట్టించుకోకపోవడం

108 అంబులెన్స్ ని తుక్కు కింద అమ్మేయటం

ఎప్పుడు చూడు దరిద్రపు కరువు తీసుకొని రావటం

పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవడం

600 హామీల్లో రెండు హామీలు నెరవేర్చమని కూడా చెప్పుకోలేని దద్దమ్మ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు

2017లో ఆంధ్రప్రదేశ్ ని ఎయిడ్స్ లో మొదటి స్థానంలో నిలబెట్టిన గొప్ప ప్రభుత్వం

ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అనటం

మాదిగోళ్లు చదవరు అని ఎక్కిరించటం

పురందేశ్వరి కి న్యాయం చేయలేకపోవడం,

లక్ష్మీ పార్వతికి న్యాయం చేయలేకపోవటం

కళ్యాణ్ రాముని పట్టించుకోకపోవడం

చంద్రబాబు నాయుడు తమ్ముని గొలుసులతో కట్టేయడం

నారా హమారా టిడిపి హమారా సభలో నంద్యాల ముస్లిమ్స్ మీద దేశద్రోహం కేసు పెట్టిచ్చటం

నందిగం సురేష్ ని బూటు కాలుతో గుండెల మీద తన్నటం

బీసీల తోకలు కత్తిరిస్తాననటం

ఐదు సంవత్సరాలు పరిపాలించి ఖజానాలో 100 కోట్లు పెట్టి పారిపోవటం

బాబోరు ఎక్కడ ఉంటే అక్కడా దరిద్రం

రాజధాని భూములతో పాటు లక్షల కోట్ల భూములు, వేల కోట్ల గంజాయి, లోన్ ల ద్వారా వేల, లక్షల కోట్ల బ్యాంకుల లూటీ ఇప్పుడు లక్షల కోట్ల డ్రగ్స్ ఇటువంటి కిరాతక మోసగాళ్ళ గుంపు చంద్రంతాత అధికారం కోసం పోరాడేది ఇందుకోసమే నేమో!?. ఉన్మాదపు ముసలోడు మోసకారి చంద్రం చుట్టూ ఉండేది, బ్యాంకులు లూటీ చేసినవారు,ప్రజా ధనం లూటీ చేసిన వారు, నేరగాళ్లు, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారు, నీతి లేని, అతి ఘోరమైన, దుర్మార్గమైన అపద్దాల దగాకోరులే.

ఈ డ్రగ్స్ అంతా అమ్మి ఓట్లు కొన వచ్చు అని లోకేష్ ప్లాన్ వేసి బొక్క బోర్లా పడ్డాడు!

ఎల్లో గొట్టాల లో సంధ్య ఆక్వా అంటున్నారు తప్ప వారి కమ్మని పేర్లు చెప్పటం లే 

 

 

Link to comment
Share on other sites

  • The title was changed to నిన్న జలభాండం.. నేడు ఎడారి! Madhyamaneru (water, desert)

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...