Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 3

Garam Garam Varthalu​ 🧨 Smoking Hot News​ 🔥


Vijay

Question

Recommended Posts

  • 0

Chandrababu manifesto: ఇదే మా పూర్తి మేనిఫెస్టో: చంద్రబాబు

30-04-2024 Tue 17:35 | Andhra

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు

ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్

మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

cr-20240430tn6630de9217c35.jpg

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సమక్షంలో కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు అందించడం తెలిసిన నేతలు కూటమిలో ఉన్నారని వెల్లడించారు. కమిట్ మెంట్ లేని రాజకీయాల వల్ల ఏపీ నాశనమైందని, అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ప్రజల ఆస్తి ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమగ్రంగా ఆలోచించి రూపొందించిన మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చాం... కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి అని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి  చేశారు.

...

Complete article

20240430fr6630dda0340ca.jpg

20240430fr6630ddab3afd7.jpg

20240430fr6630ddb4d7103.jpg

20240430fr6630ddce61eed.jpg

20240430fr6630ddd9657b3.jpg

20240430fr6630dde6bbdf2.jpg

 

Link to comment
Share on other sites

  • 0

Narendra Modi on taxes in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ తెచ్చింది... ఢిల్లీలో గెలిస్తే 55 శాతం మీ సంపదను లాక్కుంటుంది: మోదీ హెచ్చరిక

30-04-2024 Tue 17:28 | Telangana

తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతోందన్న ప్రధాని

ఈ డబుల్ ఆర్ అంటే తెలుసునని వ్యాఖ్య

ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సగం సంపదను తీసుకుంటుందని విమర్శ

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులన్న ప్రధాని మోదీ

లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని తేలిందని వ్యాఖ్య

cr-20240430tn6630dcd34a9b3.jpg

తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. వ్యాపారవేత్తలు ఈ డబుల్ ఆర్ పన్నును కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ మళ్లీ పాతరోజులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం పూర్తి అవినీతిమయమైందని ఆరోపించారు.

ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుంది

డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే బీజేపీని గెలిపించాలని కోరారు. డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి చేరుతోందని, ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ పైన విస్తృత చర్చ సాగుతోందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్‌తో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇలాంటి ట్యాక్స్ వేస్తున్న కాంగ్రెస్‌కు మనం షాక్ ఇవ్వకుంటే రానున్న అయిదేళ్లు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని విమర్శించారు. 

కాంగ్రెస్ గెలిస్తే మీపై వారసత్వ పన్ను వేస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారసత్వ సంపదపై పన్నును తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు మన సంపాదనలో 55 శాతం మన పిల్లలకు దక్కకుండా ప్రభుత్వానికి పోతుందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదన్నారు. మేం అధికారంలోకి వస్తే మీ సంపదలో 55 శాతం వాటాను లాక్కుంటామని కాంగ్రెస్ చెబుతోందన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లలో దోచుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై పదేపదే మాట్లాడిందని, ఇప్పుడు మాత్రం ఆ అవినీతి ఫైళ్లను తొక్కి పెట్టిందని ఆరోపించారు.

లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని తేలింది

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కాం వరకు పాకిందని విమర్శించారు. లిక్కర్ స్కాం బయటపడ్డాక ఇద్దరూ తోడుదొంగలు అని తేలిందన్నారు. వందరోజుల్లో రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రూ.500 పంట బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు పేదలను పేదలుగానే ఉంచేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మహిళాశక్తి కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. కేంద్రం నిర్మించే పక్కా ఇళ్లను కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు. 

బీజేపీ పదేళ్ల కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని అవినీతి ఊబిలో నెట్టిందన్నారు. కాంగ్రెస్ అబద్దాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, మాఫియా, కుటుంబ రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పంచసూత్రాలు ఇవేనని ఎద్దేవా చేశారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Nara Brahmani: మంగళగిరిలో లోకేశ్ విజయం విషయంలో ఎలాంటి సందేహం లేదు: నారా బ్రాహ్మణి

30-04-2024 Tue 16:51 | Andhra

మంగళగిరిలో నేడు కూడా కొనసాగిన నారా బ్రాహ్మణి పర్యటన

లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారం 

వివిధ వర్గాల వారితో భేటీలు

cr-20240430tn6630d44c69bf7.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి గత కొన్ని రోజులుగా మంగళగిరిలో మకాం వేశారు. తన భర్త నారా లోకేశ్ తరఫున మంగళగిరి ఓటర్లను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నారా బ్రాహ్మణి ఇవాళ కూడా వివిధ వర్గాల వారిని కలిశారు. దీనిపై ఆమె సోషల్ మీడియా స్పందించారు. 

"మంగళగిరి నియోజకవర్గంలో మావారు నారా లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాను. స్వర్ణకారులు, చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకున్నాను. లోకేశ్ గారి విజయంలో ఎలాంటి సందేహం లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, మంగళగిరి గోల్డెన్ హబ్ గా మారడం ఖాయమని వారికి భరోసా ఇచ్చాను. ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యాపారాలు, వృత్తులు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో చూశాను. 

మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న లోకేశ్ గారికి మద్దతు ఇవ్వాలని కోరాను. విజయ పచ్చళ్ల కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడాను. పట్టణంలో వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను" అంటూ నారా బ్రాహ్మణి వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

TDP Kootami Manifesto: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... వివరాలు ఇవిగో!

30-04-2024 Tue 16:04 | Andhra

చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం

హాజరైన పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు, పవన్

cr-20240430tn6630c92536bf1.jpg

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ, రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీయే పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల, రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది... ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు.

ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు...
 

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500.... 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు

తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000... ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి వందనం'

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

 

రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి

యువతకు ఐదేళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు

మెగా డీఎస్సీపై తొలి సంతకం

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

 

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 

బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ... నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

 

తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగం

బీసీ కులాల దామాషా ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన... దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు

బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు... ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత

యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం... అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం

గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు

 

చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం... ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం

దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం... వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం

గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్

వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్... రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు

రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం... 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 

ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్

 

సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం

జీవో.217 రద్దు 

మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సాయం

చిన్న స్థాయి పోర్టులకు చేయూత

స్వర్ణకారుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేర నిధుల కేటాయింపు

చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు

వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ

 

ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు

అన్ని ఆక్వా జోన్లలో ఉండేవారికి గతంలో మాదిరే విద్యుత్ ను యూనిట్ కు రూ.1.50 చొప్పున సరఫరా

ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు... ఏవియేటర్లపై సబ్సిడీలు

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన, సరళీకృత ఇసుక విధానం

విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్ మెంట్

కాలేజీలకు రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 

రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన

 

చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ

ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు... అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం

ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహం... పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన

భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన

 

యువతలో దృఢ వైఖరి, ఆశావహ దృక్పథం పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహం

ఎక్కడిక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు

అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత

ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు 

మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు... కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలు... వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక

 

ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు... పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు... దశల వారీగా బకాయిల చెల్లింపు

ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెలా జీతాలు

సీపీఎస్ పై అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి 

తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్  సిబ్బంది, అంగన్వాడీలు, పోలీస్ సిబ్బంది కోసం మెరుగైన చర్యలు

వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు

కాపు సంక్షేమం కోసం రూ.15 వేల కోట్ల వ్యయం

ఈబీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యత... ఐదేళ్లకు ఓసారి సమీక్ష... ఆర్థిక సర్వే నిర్వహణ

కాపు యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత... ప్రత్యేక భవనాల నిర్మాణం

ఆర్యవైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు

 

రూ.4 వేల పెన్షన్లను 2024 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీ

దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు... పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.10 వేలు

కిడ్నీ వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్

పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం... గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం 

ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి ఇళ్ల నిర్మాణం... ఏ స్థలానికి పట్టా వచ్చిందో అదే చోట ఇంటి నిర్మాణం

ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ వెంటనే టిడ్కో ఇళ్ల మంజూరు

 

ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి చర్యలు... జిల్లాల వారీగా వర్గీకరణ

ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే కేటాయింపు

జీవో నెం.3 పునరుద్ధరణ... ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం 

ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

 

ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు... ఈద్గాలు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు

విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం

నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయింపు

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

ఇమామ్, మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవవేతనాలు

అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియామకం

మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థికసాయం 

హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.1 లక్ష ఆర్థికసాయం

 

క్రైస్తవుల సంక్షేమం కోసం తగిన చర్యలు

క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు

చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థికసాయం

క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు సాయం

 

రైతులకు 9 గంటలు అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ

వ్యవసాయ పనిముట్ల కొనుగోలకు సబ్సిడీ

సోలార్ పంపు సెట్లకు రాయితీ... మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు

 

ప్రతి కుటుంబానికి రూ.25 ఆరోగ్య లక్షల బీమా... ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

చంద్రన్న బీమా పథకం... సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా

విద్యుత్ చార్జీల తగ్గింపు

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి

రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

 

బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం 

జీవో నెం.21 రద్దు చేసి ఫైన్ ల భారం తగ్గింపు

అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపు

భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ

 

మద్యం ధరల నియంత్రణ, పెట్రోల్, డీజిల్ ధరల  నియంత్రణకు చర్యలు 

ఉచిత ఇసుక విధానం అమలు

రాష్ట్రంలో చాలా స్కూళ్లు మూతపడేందుకు కారణమైన జీవో నెం.117 రద్దు

డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Mudragada Padmanabham on defeating Pawan: పవన్ ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా: ముద్రగడ చాలెంజ్

30-04-2024 Tue 11:25 | Andhra

రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరన్న ముద్రగడ

ఎవరికైనా కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని విమర్శ

పవన్ టికెట్లు అమ్ముకున్నారని అంటున్నారని వ్యాఖ్య

cr-20240430tn663087e36c307.jpg

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని... ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని... మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరినీ దగ్గరకు రానివ్వరని... కనీసం తన వద్ద పనిచేసే డైరెక్టర్లకైనా కప్పు కాఫీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

వాళ్ల ఇంట్లో పది మంది ఉన్నారని... ఎవరి బర్త్ డే వచ్చినా వాళ్లింటికి కేకుతో పాటు, భోజనాలన్నీ ప్రొడ్యూసర్లు పంపించాలంట అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేక్ నుంచి ఫుడ్ వరకు నిర్మాతే భరించాలట అని అన్నారు. కాఫీ ఇవ్వడానికి కూడా పవన్ కు మనసు రాదని... ఆయనకు డబ్బే ప్రాణమని చెప్పారు. ఇతరులను గౌరవించే గుణం తనకు ఉందని అన్నారు. 

కష్టమొస్తే మాట్లాడటానికి ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా? అని పవన్ ను ముద్రగడ ప్రశ్నించారు. ఎవరినీ ప్రేమించరు, ఎవరినీ దగ్గరకు రానివ్వరని అన్నారు. పవన్ ను నమ్ముకుని నాశనమయ్యామని ఆయన పార్టీలో ఉన్నవారే అంటున్నారని చెప్పారు. రైతుల కోసం చందాలు వసూలు చేశామని చెపుతున్నారని... ఏ రైతుకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్లు కూడా అమ్ముకున్నారని అంటున్నారని చెప్పారు. పవన్ కు సినిమా ఆదాయం కంటే... రాజకీయాల్లో ఆదాయమే ఎక్కువని మీ సన్నిహితులే చెపుతున్నారని అన్నారు. పవన్ ఎవరికీ పెట్టరని, పెట్టమని చెప్పినా ఆయనకు నచ్చదని ఎద్దేవా చేశారు. తనను ఉప్మా, కాఫీ అనడానికి సిగ్గులేదూ? అని అన్నారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

YS Jagan on Sharmila, Revanth and Chandrababu: షర్మిల, రేవంత్‌రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే: జగన్

30-04-2024 Tue 10:14 | Both States

వారిద్దరి రిమోట్ చంద్రబాబు వద్ద ఉందన్న జగన్

కడపలో షర్మిల పోటీపై తనకు ఎలాంటి బాధా లేదని స్పష్టీకరణ

కాకపోతే ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనన్నదే తన బాధ అన్న జగన్

అక్రమాస్తుల కేసులో తన తండ్రి పేరును చేర్చిన కాంగ్రెస్‌తో ఆమె కలిసి పనిచేస్తోందంటూ ఆవేదన

ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు

cr-20240430tn6630771171cd2.jpg

తన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కడప లోక్‌సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్‌కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0
1 hour ago, TELUGU said:

TDP Kootami Manifesto: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... వివరాలు ఇవిగో!

30-04-2024 Tue 16:04 | Andhra

చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం

హాజరైన పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు, పవన్

cr-20240430tn6630c92536bf1.jpg

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ, రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీయే పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల, రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది... ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు.

ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు...
 

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500.... 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు

తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000... ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి వందనం'

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం

 

రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి

యువతకు ఐదేళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు

మెగా డీఎస్సీపై తొలి సంతకం

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

 

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 

బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ... నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

 

తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగం

బీసీ కులాల దామాషా ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన... దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు

బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు... ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత

యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం... అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం

గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు

 

చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం... ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం

దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం... వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం

గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్

వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్... రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు

రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం... 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 

ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్

 

సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం

జీవో.217 రద్దు 

మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సాయం

చిన్న స్థాయి పోర్టులకు చేయూత

స్వర్ణకారుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేర నిధుల కేటాయింపు

చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు

వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ

 

ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు

అన్ని ఆక్వా జోన్లలో ఉండేవారికి గతంలో మాదిరే విద్యుత్ ను యూనిట్ కు రూ.1.50 చొప్పున సరఫరా

ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు... ఏవియేటర్లపై సబ్సిడీలు

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన, సరళీకృత ఇసుక విధానం

విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్ మెంట్

కాలేజీలకు రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 

రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన

 

చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ

ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు... అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం

ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహం... పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన

భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన

 

యువతలో దృఢ వైఖరి, ఆశావహ దృక్పథం పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహం

ఎక్కడిక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు

అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత

ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు 

మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు... కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలు... వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక

 

ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు... పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు... దశల వారీగా బకాయిల చెల్లింపు

ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెలా జీతాలు

సీపీఎస్ పై అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి 

తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్  సిబ్బంది, అంగన్వాడీలు, పోలీస్ సిబ్బంది కోసం మెరుగైన చర్యలు

వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు

కాపు సంక్షేమం కోసం రూ.15 వేల కోట్ల వ్యయం

ఈబీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యత... ఐదేళ్లకు ఓసారి సమీక్ష... ఆర్థిక సర్వే నిర్వహణ

కాపు యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత... ప్రత్యేక భవనాల నిర్మాణం

ఆర్యవైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు

 

రూ.4 వేల పెన్షన్లను 2024 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీ

దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు... పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.10 వేలు

కిడ్నీ వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్

పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం... గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం 

ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి ఇళ్ల నిర్మాణం... ఏ స్థలానికి పట్టా వచ్చిందో అదే చోట ఇంటి నిర్మాణం

ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ వెంటనే టిడ్కో ఇళ్ల మంజూరు

 

ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి చర్యలు... జిల్లాల వారీగా వర్గీకరణ

ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే కేటాయింపు

జీవో నెం.3 పునరుద్ధరణ... ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం 

ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

 

ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు... ఈద్గాలు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు

విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం

నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయింపు

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

ఇమామ్, మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవవేతనాలు

అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియామకం

మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థికసాయం 

హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.1 లక్ష ఆర్థికసాయం

 

క్రైస్తవుల సంక్షేమం కోసం తగిన చర్యలు

క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు

చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థికసాయం

క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు సాయం

 

రైతులకు 9 గంటలు అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ

వ్యవసాయ పనిముట్ల కొనుగోలకు సబ్సిడీ

సోలార్ పంపు సెట్లకు రాయితీ... మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు

 

ప్రతి కుటుంబానికి రూ.25 ఆరోగ్య లక్షల బీమా... ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

చంద్రన్న బీమా పథకం... సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా

విద్యుత్ చార్జీల తగ్గింపు

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి

రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

 

బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం 

జీవో నెం.21 రద్దు చేసి ఫైన్ ల భారం తగ్గింపు

అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపు

భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ

 

మద్యం ధరల నియంత్రణ, పెట్రోల్, డీజిల్ ధరల  నియంత్రణకు చర్యలు 

ఉచిత ఇసుక విధానం అమలు

రాష్ట్రంలో చాలా స్కూళ్లు మూతపడేందుకు కారణమైన జీవో నెం.117 రద్దు

డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

...

Complete article

Aa unrealistic long list chustuntene mind dobbutundi chandrababu’s desperation to win but who is going to believe him? Adi chestam, idi chestam, adi istam, idi istam… People have heard enough of these already.

Ninnu Nammam Babu song 🤣

Even BJP is not getting involved in this bogus manifesto and distancing itself from these fake promises to keep themselves safe as they know CBN is going to grossly default on these promises if he comes to power just like he defaulted  it he past!

 

Link to comment
Share on other sites

  • 0

TV9 Mass Trolling On Glass Symbol పగిలేకొద్దీ పదునెక్కే గ్లాస్!!

 

Link to comment
Share on other sites

  • 0

చంద్రబాబు గనక ఈ యాడ్ చూస్తే ఎక్కి ఎక్కి ఏడుస్తాడు బయ్యా!YCP Latest Election ADD | Sri Media Daily

 

Link to comment
Share on other sites

  • 0

Chandrababu: I invented Alexa. You can use it to do anything and ask anything and she will tell you! No need to use your phone.

Me: Alexa, what will be situation of CBN after June 4?

Alexa: Katakataala Chandrayya

Why did Alexa did not tell you in 2019 of your humiliating defeat?

మరి 2024లో ఓడిపోతున్నారు అని అలేక్సా చెప్పలేదా నీకు😂😂😂😂

 

:emoji-lol:

https://www.instagram.com/p/C6a-U9LpoLH

Link to comment
Share on other sites

  • 0

Pappu on deleting TDP manifesto from their website

మేనిఫెస్టో డిలీట్ చేసినంతమాత్రాన ప్రజలు దానిని మర్చిపోరు చంద్రబాబు.. 😂

https://www.instagram.com/p/C6WJTlApPTF

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.


×
×
  • Create New...