Jump to content
  • 💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.

  • 0

2-hour long meeting between Chandrababu and Revanth


Sanjiv

Question

రెండు గంటల పాటు సాగిన ఇద్దరు సీఎంల భేటీ.. సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్..!

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పదేళ్లుగా పరిష్కారం కాని విభజన హామీలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజా భవన్‌లో సమవేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు.

Revan Reddy Chandrababu

revan-reddy-chandrababu.jpg?w=1280

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పదేళ్లుగా పరిష్కారం కాని విభజన హామీలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజా భవన్‌లో సమవేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. మరోసారి భేటీ కావాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు వీలుగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా భద్రాచలం నుండి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను..తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఈ గ్రామాల విలీనంతో భద్రాచలం పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెబుతోంది. అయితే ఓ రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే.. కేంద్ర అనుమతి తప్పనిసరి. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రజాభవన్ భేటీలో విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేశారు ఇరువురు ముఖ్యమంత్రులు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడకుండా ఉమ్మడి అజెండాపై కలిసిపని చేయాలని రెండు రాష్ట్రాలు మొదటి నుంచి భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని, ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు.

ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తైనా కూడా.. అనేక కీలకాంశాలు ఇంకాపెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా తొమ్మిది ఎజెండా అంశాలను ఖరారు చేశారు. ఈ ఎజెండాలో రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపకాలు, ఏపీ ‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు, పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో నిర్మించిన ప్రాజెక్టుల ఆస్తులు-అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన చెల్లింపులు, లేబర్‌ సెస్‌ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు.

ముఖ్యమంత్రులో భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్థన్‌రెడ్డి పాల్గొనగా, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

4 answers to this question

Recommended Posts

  • 0

CBN Revanth: ఇద్దరు సీఎంలు కలిసిన వేళ.. చంద్రబాబుకు రేవంత్‌ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ ఏంటంటే..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక భేటీకి హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ వేదికైంది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలతో పాటు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. సమావేశం ముగిసిన అనంతరం ఉమ్మడి ప్రెస్‌మీట్‌ ఉండే అవకాశం ఉంది..

cbn-revanth-meeting.jpg?w=1280&enlarge=t

శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రులో భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్థన్‌రెడ్డి పాల్గొనగా..తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఏపీ,తెలంగాణ సీఎస్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

revanth.jpg

అనంతరం చంద్రబాబును సన్మానించి..కాళోజీ రాసిన "నా గొడవ" పుస్తకాన్ని బహూకరించారు రేవంత్‌రెడ్డి. నిజాం కాలం నుంచి 1980ల వరకూ పాలన..ఏళ్లతరబడి సాగిన తెలంగాణ ప్రజాఉద్యమాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించారు ప్రజాకవి కాళోజి. ఇక చంద్రబాబు..రేవంత్‌రెడ్డికి తిరుమల శ్రీవారి ప్రతిమతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రజాభవన్ భేటీలో విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

cbn.jpg

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడకుండా ఉమ్మడి అజెండాపై కలిసి పని చేయాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని , ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం ఉంది.

chandrababu.jpg

ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయినా కూడా.. అనేక కీలకాంశాలు ఇంకాపెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా తొమ్మిది ఎజెండా అంశాలను ఖరారు చేశారు.

meeting.jpg

ఈ ఎజెండాలో రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపకాలు, ఏపీ ‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు, పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో నిర్మించిన ప్రాజెక్టుల ఆస్తులు-అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన చెల్లింపులు, లేబర్‌ సెస్‌ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలు ఉన్నాయి.

...

Complete article

Link to comment
Share on other sites

  • 0

Decisions: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ: కీలక నిర్ణయాలివే

picture94-1720280112.jpg

విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో పది కీలక అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల సీఎంలు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలిసింది.

అంతకుముందు ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు. .. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రజాభవన్‌లోకి చేరుకున్న చంద్రబాబును శాలువతో సత్కరించిన రేవంత్‌రెడ్డి.. కాళోజీ నారాయణరావు రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చ కొనసాగింది. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్బాబు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్కుమార్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లు శాంతికుమారి, నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పలువురు హాజరయ్యారు. కాగా, తెలంగాణలోని భవనాలను ఏపీకి ఇచ్చేందుకు సీఎం రేవంత్ నిరాకరించినట్లు సమాచారం. అయితే, భవన నిర్మాణానికి కావాల్సిన స్థలం ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

సీఎంల భేటీలో చర్చించిన అంశాలివే

ఉద్యోగుల విభజన అంశాలు
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించే అంశం
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
పెండింగ్ విద్యుత్ బిల్లులు
లేబర్ సెస్ పంపకాలు.

రేవంత్ కోరే డిమాండ్లు:
– తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలి.
– 100కి.మీల కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా కావాలి.
– కృష్ణాజలాల్లో 558 TMCలు కేటాయించాలి.
– ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలి.
– విద్యుత్‌ బకాయిలు రూ.24వేల కోట్లు చెల్లించాలి.
– కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలి.

చంద్రబాబు డిమాండ్లు
– జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం ఉండాలి.
– విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్నీ పంచాలి.
– వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి.
– హైదరాబాద్‌లోని 3 భవనాలు ఏపీకి కేటాయించాలి.
– విద్యుత్ బకాయిలు రూ.7,200 కోట్లు చెల్లించాలి.

Link to comment
Share on other sites

  • 0

గతంలో టీజీ, ఏపీ సీఎంల భేటీలన్నీ తెలంగాణను ఆంధ్రకు దోచిపెట్టడం కోసమే జరిగేవి.. కానీ ఇప్పుడు విభజన సమస్యల పరిష్కారానికే భేటీలు జరుగుతున్నాయి!

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.

Guest
Answer this question...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...