-
💡 You can translate our web pages into Telugu, Hindi or any of the 133 languages using the LANGUAGE dropdown in the header for better understanding. Your language choice is remembered across pages and you can hover or tap on any item to see its original/English version in a popup. You can change the language or restore the English version at any time from the translation toolbar that appears in the header after translation. On mobile devices, you may have to tilt the device HORIZONTALLY to see the full translation toolbar.
- 0
Question
TELUGU
రాష్ట్రాన్ని దద్దమ్మలు, చేతకానివాళ్లు పాలిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తాను పదవి నుంచి తప్పుకోగానే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. ప్రజల కోసం తాను ఎక్కడెక్కడి నుంచో కరెంటు తెచ్చి ఇచ్చానని, కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీని కూడా జనరేటర్ పెట్టి నడిపించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఏ భ్రమలకో లోనై.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అయినా తమకు అప్పజెప్పిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మళ్లీ రెట్టింపు వేగంతో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభకు కేసీఆర్ ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు. పిడికెడు మంది కోసమో, ఒకరిద్దరి కోసమో ఈ సభ జరపడం లేదు. కృష్ణా నీళ్లలో మన హక్కుల కోసం, మన జీవన్మరణ సమస్య కోసం, మన బతుకు కోసం పెట్టిన సభ. కేంద్ర ప్రభుత్వానికి, బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్కు, కేంద్ర మంత్రికి ఈ సభ హెచ్చరిక.
కృష్ణా నీళ్లలో మన వాటా మనకు దక్కేంతవరకు ఈ జల ఉద్యమం ఆగదు. నాకు కాలు విరిగినా, కుంటి నడకతోనైనా, కట్టె పట్టుకొనైనా ఇంత ఆయాసంతోనైనా ఈ సభకు రావాల్సి వచ్చింది. నేను సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేను. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడడానికి బెబ్బులిలా వచ్చాను. నా కటె ్ట కాలేంతవరకు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతాను’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ సభతో జల ఉద్యమం ఆగదని, కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కులు సాధించేంత వరకు తాము విశ్రమించబోమని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలిసి నిలదీయాలని, నీటి హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడాలని సూచించారు. ఆరు నెలల్లో నీటిహక్కులు తేల్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తాను 24 ఏళ్లపాటు పక్షిలా తెలంగాణ అంతా తిరిగి ఇటు కృష్ణా, అటు గోదావరి నీళ్లు లేకుంటే మనకు బతుకే లేదని వివరించానని తెలిపారు. కేఆర్ఎంబీ విషయంలో ఆనాడు కేవలం ఒక్క ఏడాది కోసం సర్దుకోవాలని కేంద్రం చెబితే.. సరేనన్నామని చెప్పారు. తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో వందల లేఖలు రాసినా స్పందించలేదని విమర్శించారు. తాము మునిగిందే నీళ్లలోనని, నీళ్లలో తమ వాటా తేల్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. ట్రైబ్యునల్ కోసం నిలదీశామని, కేంద్రం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లామని అన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్ వేస్తామని కేంద్రం అడిగితే.. వెనక్కి తీసుకున్నామని గుర్తు చేశారు. ట్రైబ్యునల్ కోసం, నీటి వాటాల కోసం ఇటీవల కూడా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేశారని, కేంద్ర మంత్రిని కూడా కలిశారని వివరించారు. అయితే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాక.. ట్రైబ్యునల్ వేయాలంటూ ఎందుకు అడుగుతున్నారని ఎంపీలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రశ్నించారని చెప్పారు.
కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ల పని
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జలవనరుల కోసం, హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ల పని అని కేసీఆర్ అన్నారు. ప్రజలపై ప్రేమ, మమకారం ఉంటే, ప్రజలకు ఏమైనా చేయాలనే తపన ఉంటే హక్కుల కోసం పోరాడతారని, కానీ.. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి పదవులపైనా, పైరవీలపైనా, డబ్బులపైనే తప్ప.. ప్రజలపై, ప్రజల హక్కులపై మమకారం లేదని విమర్శించారు. ‘‘కేంద్రం వద్ద నీటి హక్కులను ఎలా సాధించాలనే విషయంలో మీకు అమాయకత్వమో, అడిగే సంస్కారం లేదో, తెలివి ఉందో, లేదో అర్థంకావడం లేదు. నీటిని ఎలా సాధించాలనే అంశంలో సీనియర్లు పొన్నాలను, కడియంను, నన్ను, హరీశ్ను.. ఎవరిని అడిగినా చెప్పేవాళ్లం. తెలివితక్కువగా వ్యవహరించి రాష్ట్ర హక్కులకు భంగం కలిగించారు’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చేసిన తీర్మానంలోనూ తెలివితక్కువతనం బయటపడిందని, కేవలం నదీజలాల్లో హక్కుల అంశాన్నే తీర్మానంలో పెట్టారని, విద్యుదుత్పత్తి అంశాన్ని పెట్టలేదని అన్నారు. కృష్ణాజలాల్లో హక్కుల కోసం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలని సూచించారు. హక్కులు సాధించేవరకు పోరాడాలని, కృష్ణానీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంపైనా, మోదీపైనా పోరాడామని, కరెంటుకు మీటర్లు పెట్టమంటే పెట్టేదిలేదని తేల్చిచెప్పామని అన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామన్నా వినలేదన్నారు.
సోయిలేకుండా మాట్లాడుతున్న మంత్రులు
కాంగ్రెస్ మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండెనని, ఇప్పుడే బాగాలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అసెంబ్లీలో అన్నారని, మరి ఆనాడే బాగుంటే ఇదే జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎందుకు అమరత్వం పొందారని, ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. ఉత్తమ్కుమార్రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. రైతుబంధు ఇవ్వలేక చేతులెత్తేశారని, రైతులు అడిగితే ఒక మంత్రి సంస్కారం లే కుండా చెప్పుతో కొట్టాలన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతులను చెప్పుతో కొట్టమంటారా? మీకు ఎన్ని గుండెలు? నిలదీశారు. రైతులకూ చెప్పులుంటాయి. వాళ్లు కొడితే 32 పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త’’ అని కేసీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు మేడగడ్డకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ‘‘ఎల్ఎండీ, ఎంఎండీ నింపి ఐదు లక్షల ఎకరాలను నీరివ్వాల్సి ఉంటే.. ఆ పని చేయకుండా మేడిగడ్డకు పోతాం.. బొందలగడ్డకు పోతామంటున్నారు. అక్కడేమైనా తోకమట్ట ఉందా? అక్కడికి వెళ్లి ఏం చేస్తారు?’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తాము కూడా అక్కడికే వెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెడతామన్నారు. చిత్తశుద్ధి ఉంటే కాఫర్డ్యామ్ కట్టి అయినా నీళ్లివ్వవచ్చని చెప్పారు. 250, 300 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలు, 200 కిలోమీటర్ల టన్నెల్, 1500 కిలోమీటర్ల కాల్వలు, 19 సబ్స్టేషన్లు , 20వరకు రిజర్వాయర్లు ఉన్నాయని, ఇంత వ్యవస్థలో రెండు మూడు పిల్లర్లు కుంగాయన్నారు. వాటిని రిపేరు చేసి నీరివ్వాలే తప్ప.. చిల్లర రాజకీయాలు చేయడమేంటని మండిపడ్డారు. గతంలో నాగార్జునసాగర్లో కుంగలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కోసుకుపోలేదా? మూసీ ప్రాజెక్టు మూసుకుపోలేదా? అని ప్రశ్నించారు.
..
Complete article
Link to comment
Share on other sites
0 answers to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.